దేశం కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతున్న సమయంలో విదేశాల నుంచి సెల్ఫ్ ఐసోలేషన్ నిబంధనలు ఉల్లంఘించి దేశంలోని ప్రముఖులను కలిసిన బాలివుడ్ సింగర్ కనికా కపూర్ ఎట్టకేలకు కోవిడ్ 19 నుంచి కోలుకుంటున్నారు. కనికా కపూర్ కు కరోనా పాజిటీవ్ రాగానే ఒక్క సారిగా దేశం ఉలిక్కి పడింది.
బిజెపి ఎంపి దుష్యంత్ సింగ్ తో సన్నిహితంగా మెలిగిన కనికా కపూర్ ఆ తర్వాత వివిఐపిలకు పార్టీ ఇచ్చారు. ఆమెకు పాజిటీవ్ రాగానే ఆమెతో కలిసిన వారంతా ఒక్క సారిగా ఆందోళనకు గురయ్యారు. ఆమెను లక్నోలోని సంజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చేర్చి చికిత్స చేశారు.
మూడు టెస్టులలో పాజిటీవ్ కొనసాగడంతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై కూడా అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు ఆరో టెస్టులో కరోనా నెగెటీవ్ వచ్చింది. దాంతో ఆమె తాను ఇంటికి వెళతానని చెప్పింది. అయితే డాక్టర్లు అందుకు అనుమతించలేదు. మరో టెస్టు చేస్తామని అందులో కూడా నెగెటీవ్ వస్తేనే పంపుతామని తేల్చి చెప్పారు.