28.7 C
Hyderabad
April 20, 2024 04: 23 AM
Slider జాతీయం

ట్రాజెడీ టూర్:లోయలో బస్సు బోల్తా 9మంది మృతి

karntaka chikmagaloor bus fell down 9 dead

కర్ణాటకలోని చిక్మగళూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.విహార యాత్రకు వెళుతున్న ఒక ప్రయాణికుల బృందం ప్రయాణిస్తున్నబస్సు దీర్ఘటనకు గురికావడం తో వారి కుటుంబాల్లో విషాదం నెలకుంది. శనివారం మైసూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు ఉడుపి సమీపంలోని చిక్కమగళూరు ఘాట్‌ రోడ్డు కార్క తాలూకా మాళె సమీపంలోని లోయలో అదుపుతప్పి పడిపోయింది.

ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు రెస్క్యూ టీం సహాయంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు అతివేగంగా వెళ్తూ బండరాళ్లను ఢీ కొనడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా మైసూర్‌కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులుగా గుర్తించారు. విహారయాత్ర కోసమని వీరు మైసూర్ నుంచి బయలుదేరగాఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Related posts

టిడిపి సీనియర్ నేత ఎన్ శివప్రసాద్ కన్నుమూత

Satyam NEWS

అంతర్జాతీయ ర్యాపిడ్ రేటింగ్ టోర్నమెంట్ లో విక్టరి విద్యార్థుల ప్రతిభ

Satyam NEWS

ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి

Satyam NEWS

Leave a Comment