కర్ణాటకలోని చిక్మగళూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.విహార యాత్రకు వెళుతున్న ఒక ప్రయాణికుల బృందం ప్రయాణిస్తున్నబస్సు దీర్ఘటనకు గురికావడం తో వారి కుటుంబాల్లో విషాదం నెలకుంది. శనివారం మైసూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు ఉడుపి సమీపంలోని చిక్కమగళూరు ఘాట్ రోడ్డు కార్క తాలూకా మాళె సమీపంలోని లోయలో అదుపుతప్పి పడిపోయింది.
ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు రెస్క్యూ టీం సహాయంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు అతివేగంగా వెళ్తూ బండరాళ్లను ఢీ కొనడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా మైసూర్కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులుగా గుర్తించారు. విహారయాత్ర కోసమని వీరు మైసూర్ నుంచి బయలుదేరగాఈ ప్రమాదం చోటుచేసుకుంది.