ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్బంగా తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని HCU లోని మియావాకి పార్క్ లో ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, మేయర్ బొంతు రామ్మోహన్, జోనల్ కమిషనర్ రవికిరణ్, డీసీ వెంకన్న, జీవ వైవిధ్యం డిప్యూటీ డైరెక్టర్ నీరజ గాంధీ పాల్గొన్నారు.
ఇంకా బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, కార్పొరేటర్లు సాయిబాబ, రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు ఎమ్మెల్యే గాంధీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుజన్మదిన శుభాకాంక్షలు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు, నాయకులూ, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.