39.2 C
Hyderabad
March 29, 2024 17: 14 PM
Slider మహబూబ్ నగర్

పబ్లిక్ గా మందు కొడుతున్న ఏడుగురిపై కేసు

Kollapur SI

ఎంత చెప్పినా వినకుండా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం అలవాటైపోయింది పోకిరిలకు. దాంతో పోలీసులు కఠిన మైన చర్యలు తీసుకుంటున్నారు. కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా మద్యపానం చేస్తున్న ఏడుగురు కొద్ది సేపటి కిందట పోలీసులకు దొరికారు. పబ్లిక్ గా కూర్చుని బార్ సెటప్ వేసుకుని మందు తాగుతున్న ఈ ఏడు మంది వ్యక్తుల పైన కేసు నమోదు చేసినట్లు కొల్లాపూర్ ఎస్ ఐ కొంపల్లి మురళి గౌడ్ తెలిపారు.

ఎవరైనా బహిరంగ మద్యపానం చేస్తే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. అదే విధంగా వారికి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని ఎస్ ఐ తెలిపారు. దయచేసి ఎవరు కూడా బహిరంగంగా మద్యం సేవించి నేరాలకు కారకులు కాకూడదు ఇది మా పోలీసువారి హెచ్చరిక అని ఎస్ ఐ కొంపల్లి మురళి గౌడ్ అన్నారు.

Related posts

కోట్లకు పగడలెత్తిన మాజీ ఆప్కో చైర్మన్

Satyam NEWS

ఇన్స్పెక్షన్: పొద్దుటూరు నారాయణ స్కూల్లో తనిఖీలు

Satyam NEWS

హుదూద్ ఇల్లుకు కరెంట్ నీరు సౌకర్యం కల్పించాలని

Satyam NEWS

Leave a Comment