సినీ రంగంతో బాటు వస్త్ర వ్యాపార రంగంలో చురుకుగా పాల్గొంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన కంపెనీ ది హంబుల్ కో నుంచి నూతన వస్త్ర శ్రేణి ని మార్కెట్ లో ప్రవేశ పెట్టారు. ఈ కొత్త శ్రేణి వస్త్రాలను మైంత్రలో నేటి నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో మహేష్ బాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మైంత్ర, జబాంగ్ హెడ్ అమర్ నగరం, స్పోయల్ ప్రయివేట్ బ్రాండ్స్ హెడ్ శుష్రుతి కూడా పాల్గొన్నారు. మైంత్ర ద్వారా కొత్త వస్త్ర శ్రేణిని ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందని మహేష్ బాబు ఈ సందర్భంగా చెప్పారు.