కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి గురుభక్తి ఉత్సవాలు శ్రీ మఠం పీఠాధిపతి సుభూదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుండి స్వామివారి బృందావనం కు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభూదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్ర స్వామి 399 పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి పాదుకలు ను నవరత్న స్వర్ణరథంపై ఉంచి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం చుట్టూ విశేష జనవాహిని మధ్య ఊరేగించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీసుభూదేంద్రతీర్థులు భక్తులకు ఫల అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.