హైదరాబాద్ లోని చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన నిలోఫర్ ఆసుపత్రిలోని వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయట పడ్డది. అక్కడి వైద్యుల నిర్లక్ష్యం వల్ల మమత అనే తల్లికి గర్భశోకం కలిగింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ మూడు నెలల బాబు మరణించినట్లు తల్లిదండ్రుల ఆరోపణలు చేస్తున్నారు.
మమత, అనిల్ యాదవ్ బంధువులు నీలోఫర్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప మృతి చెందిందని ఆరోపిస్తూ నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేస్ పెట్టారు. పోస్టుమార్టం కోసం బాబు మృతదేహం ఉస్మానియా ఆసుపత్రి తరలించారు.