తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కుమార్తె నీత, అనూప్ ల వివాహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో బాటు ఆయన సతీమణి కూడా ఉన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీలు జోగినిపల్లి సంతోష్ కుమార్, రంజిత్ తదితరులు కూడా వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మంత్రి ఈటల రాజేందర్ కుమార్తె వివాహంతో మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం పూడూరు గ్రామం శుక్రవారం నాడు అంతా సందడిగా మారింది.