కొల్లాపూర్ మండలం ఎల్లూర్ గ్రామములో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే వరి కొనుగోలు కేంద్రాన్ని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు కష్టించి పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందని అన్నారు.
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎంతో పురోగమిస్తున్నదని, రైతుల సంక్షేమం కోసం కట్టుబడిన ప్రభుత్వం ఇది అని ఈ సందర్బంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమములో మార్కెట్ యార్డ్ చెర్మెన్ నరేందర్ రెడ్డి, వైస్ చెర్మెన్ కురుమయ్య, జడ్పీ జిల్లా కోఆప్షన్ సభ్యులు మతీన్, జడ్పీటీసీ భాగ్యమ్మ, సర్పంచ్ లక్ష్మీ దేవమ్మ, ఎంపీటీసీ లు మంజుల, శంకర్, పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.