నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల్ల అడవిలో దారుణం చోటు చేసుకున్నది. అక్క మహాదేవి దేవాలయానికి కాలినడకన వెళ్లే దారిలో శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగింది. బొంబాయి చెందిన వివాహిత మహిళ శాంత రవిముదీయర్(50) పై ఎవరో అత్యాచారం, చేసి ఆపై గొంతు కోసి హత్య చేశారు. ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారో తెలియడం లేదు.
కారడవిలో జరిగిన ఈ దారుణంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ నిమ్మకాయలు కుంకుమ అగర్ బత్తిలు కూడా ఉండటంతో క్షుద్ర పూజలు జరిపి ఆ తర్వాత ఆమె గొంతు కోసి చంపారా అని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ రోజు ఉదయం అటవీశాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అచ్చంపేట డిఎస్పీ నరసింహులు సంఘటన స్థలానికి చేసుకొని పరిశీలించారు. అక్కడ గుర్తు పట్టకుండా ఉన్న మహిళ శవం ను గుర్తించారు.
అక్కడే పడి ఉన్న మృతురాలి ఫొటో, బ్యాగ్ మరికొన్ని వస్తువులు స్వాధీన పరచుకొని విచారణ చేపట్టారు. అక్కడ ఉన్న ఆధారాల ప్రకారం ఆమెను శాంత రవిముదీయర్ గా గుర్తించారు. ఆమె పై అత్యాచారం జరిగినట్లు కూడా ప్రాధమిక విచారణలో తేలింది. ఆపై గొంతు కోసి హత్య చేసినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు.