30.7 C
Hyderabad
April 23, 2024 23: 00 PM
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూలు జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేస్ నమోదు

Nagarkarnool Collector

ఢిల్లీ మర్కజ్ మసీదులో జరిగిన తబ్లిగీ జమాత్ లో పాల్గొని తిరిగి వచ్చిన నాగర్ కర్నూలు పట్టణానికి చెందిన 32 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారికంగా వెల్లడించారు. అతడిని హైదరాబాద్  హాస్పిటల్ కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

నాగర్ కర్నూలు పట్టణంలోని అతడు నివాసం ఉంటున్న వార్డులో శానిటేషన్ పనులు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. చుట్టూ పరిసర ప్రాంతాల్లో 100%  లాక్ డౌన్ చేపట్టాలని అతడు ఎవరెవరితో సన్నిహితంగా మెలిగాడో వివరాలు సేకరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచనలు జారీ చేశారు

Related posts

లార్డ్ బాలాజీ:జమ్ముకశ్మీర్‌లో వెంకన్న ఆలయం

Satyam NEWS

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంలో పండగపూట ఇండ్లలోకి మురికి నీరు

Satyam NEWS

సకాలంలో సీఎంఆర్ పూర్తి చేసే మిల్లర్లపై ఒత్తిడి తగ్గించే చర్యలు

Satyam NEWS

Leave a Comment