37.2 C
Hyderabad
March 29, 2024 20: 49 PM
Slider కడప

నందలూరులో భోగాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు

nandaluru temple

కడప జిల్లా రాజంపేట టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయుడు  కడప జిల్లా నందలూరు మండలం కంపిణీపురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ భోగాంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనను మేళతాళాలతో పూలు చల్లుతూ, టపాకాయలు కాలుస్తూ ఘనంగా ఆహ్వానించారు.

ముందుగా ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీర్వదం పొందారు. అక్కడ రధోత్సవం కోసం ఏర్పాటు చేసిన రథాన్ని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ప్రజల ఆకాంక్ష మేరకు కంపిణీపురం అంతా ప్రజలతో కలిసి పాదయాత్ర చేస్తూ గ్రామ ప్రజలను పలకరించారు.

అలాగే నూకినేని పల్లి సుధాకర్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. అక్కడికి ప్రజా సమస్యలతో కలవడానికి వచ్చిన సిద్ధవటం, ఒంటిమిట్ట వారితో మాట్లాడి సమస్యలపై చర్చించి వాటిని పై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు.

ఆయనతో పాటు మాజీ మండల అధ్యక్షుడు సమ్మెట శివప్రసాద్, జడ్పీటీసీ శివరామరాజు, మాజీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ ఎద్దల సుబ్బరాయుడు, రాష్ట్ర అఖిలభారత యాదవ సంగం ప్రధాన కార్యదర్శి భారతాల శ్రీధర్ యాదవ్, మాజీ ఉప మార్కెట్ చైర్మన్ తాటి సుబ్బరాయుడు, బ్రహ్మయ్య, జివ్వాజి వెంకటసుబ్బయ్య, సుదర్శన్ ఉన్నారు. ఇంకా మోహన్, నూకినేని పల్లి సుధాకర్ వారి అన్నదమ్ములు, నాగముని రెడ్డి, శివ, నామాల వెంకటయ్య, జైసింహ, బాలు, శివయ్య, కొండా శ్రీనివాసులు, గుగ్గిళ్ల సుబ్బరాయుడు, ఎన్నారై రమణ, విజయభాస్కర్, యన్.వి.రమణ, యనాది, కొండయ్య, బొబ్బిలి తదితరులు పాల్గొన్నారు.

Related posts

అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ ధ్యేయం

Satyam NEWS

సరిహద్దు వివాదంపై భారత్ కు అమెరికా మద్దతు

Satyam NEWS

టీటా గ్లోబ‌ల్ ఎన్నారై జాయింట్ సెక్ర‌ట‌రీగా భాస్క‌ర్ గుప్త‌ న‌ల్ల‌

Satyam NEWS

Leave a Comment