రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ పొందిన నటుడు ప్రభాస్. ఇటీవల సాహో చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. తెలుగుతో పాటు పలు భాషలలో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ పొందింది. ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు ప్రభాస్. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జాన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అయితే సాహో చిత్ర రిలీజ్ సమయంలో ఓ కాంటెస్ట్ నిర్వహించగా, అందులో విజేతగా నిలిచిన వారికి ప్రభాస్ని కలిసే ఛాన్స్ కలిపించారు మేకర్స్ . ఇందులో భాగంగా కాంటెస్ట్ విన్నర్స్ ఇటీవల ప్రభాస్ని కలిసారు. తాజాగా మరికొంత మంది ఫ్యాన్స్ ప్రభాస్ని కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలలో ప్రభాస్ స్టైలిష్ లుక్లో చాలా రాయల్గా కనిపిస్తున్నారు. స్మార్ట్గా కనిపిస్తున్న ప్రభాస్ని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.