పూణేకు చెందిన నిర్మలా గోఖలే అనే మహిళ ఫుట్పాత్లపై నుంచి బైకులు దూసుకెళ్లడం ని నివారించాలని రంగం లోకి దిగింది.ట్రాఫిక్ సిగ్నల్ పడినా, వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నా వెంటనే బైక్ పై వెళ్లే వారు ఫుట్ పాత్ లపై నుండి వెళ్లాలని ప్రయత్నిస్తారు.వారిని అడ్డుకోవడానికి తనతో పాటు కొంత మందిని వెంటపెట్టుకొని వచ్చి ఫుట్పాత్పై నిలబడింది.
సిగ్నల్ పడిన వెంటనే బైక్పై వచ్చే వాళ్లు ఫుట్పాత్ ఎక్కితే దమ్ముంటే నన్ను ఢీకొట్టి ముందుకు వెళ్లు అని ముఖం మీదే చెప్పడం ప్రారంభించింది. ఆ పెద్దావిడ మాటలు విని సిగ్గుతో టూవీలర్ పై వచ్చే వారు మార్చుకుంటూ తిరిగి రోడ్డు మార్గం ద్వారా వెళ్లడం ప్రారంభించారు. అలా వచ్చిన ప్రతి ఒక్కరిని తరమడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పెద్దావిడ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.