దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలనుసారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజలకు అవగాహక కార్యక్రమం చేపట్టారు.
బుధవారం ఖమ్మం నగరంలో రోడ్ల పైకి అనవసరంగా వస్తున్న వారికి పలు సూచనలు చేశారు. మనం ప్రమాదంలో ఉన్నామని, వాటి నుండి బయటపడాలంటే ప్రజలు స్వచ్చందంగా ప్రభుత్వంకు సహకరించాలన్నారు. అత్యావసరం అయితే తప్ప రోడ్డుపైకి రావొద్దని విజ్ఞప్తి చేశారు.
గుంపులు గుంపులుగా నిలబడటం, ఇతర వ్యక్తులతో దెగ్గరగా మాట్లాడటం చేయకూడదని కోరారు. కూరగాయలు, మెడికల్ దుకాణంలో సామాజిక దూరం పాటించాలన్నారు.