33.2 C
Hyderabad
April 26, 2024 01: 28 AM
ఆంధ్రప్రదేశ్

బార్ల లైసెన్సులకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

Bar1

రాష్ట్రవ్యాప్తంగా బార్ల లైసెన్సులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారంవచ్చే జనవరి ఒకటి నుంచి 2021 డిసెంబర్ 31 వరకూ రెండేళ్లపాటు లైసెన్సులు జారీ చేస్తారు. మున్సిపల్ కార్పోరేషన్ లు,మున్సిపాలిటీలు,నగర పంచాయతీలు యూనిట్ గా బార్లు కేటాయింపు ఉంటుంది. కార్పొరేషన్లలో దరఖాస్తు ఫీజు 4లక్షల 50 వేలు,మున్సిపాలిటీలు,నగర పంచాయతీలలో ఫీజు 2 లక్షలుగా నిర్ధారించారు.

విజయవాడ,విశాఖలో దరఖాస్తు ఫీజు 7 లక్షలుగా ఉంటుంది. అదే విధంగా 98 చోట్ల ఏడాదికి లైసెన్సు ఫీజు 5 లక్షలుగా ప్రభుత్వం నిర్ధారించింది. ఇవాల్టి నుంచి వచ్చే నెల 6 వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టర్లు లాటరీ తీస్తారు. అదే రోజు రాత్రి 7 గంటల కల్లా బార్ల కేటాయింపు జాబితా విడుదల చేస్తారు.

Related posts

ఇసుక దీక్షతో రాష్ట్ర ప్రభుత్వం దిగిరావాలి

Satyam NEWS

ఇంగ్లీష్ మీడియం బోధనే ఉంటుంది…మారదు

Satyam NEWS

షెడ్యూల్ ప్రకారమే ఏపీలో పదో తరగతి పరీక్షలు

Satyam NEWS

Leave a Comment