పాకిస్తాన్ జిందాబాద్… పాకిస్తాన్ జిందాబాద్… ఈ స్లోగన్లు పాకిస్తాన్ లోనో జమ్మూ కాశ్మీర్ లోనో వినిపించలేదు. కొద్ది సేపటి కిందట బెంగళూరులో వినిపించాయి. దేశం మొత్తం నిర్ఘాంత పోయే ఈ సంఘటన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ నిర్వహించిన సభలో నేటి సాయంత్రం జరిగింది.
పౌరసత్వ చట్టంపై నిరసన వ్యక్తం చేసేందుకు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అత్యధికంగా ముస్లింలు ఈ సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ పౌరసత్వ చట్టం దేశ రాజ్యాంగానికి విరుద్ధమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కావాలని ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారని దీనివల్ల దేశ రాజ్యాంగానికి విఘాతం కలుగుతుదని ఆయన అన్నారు.
ఇదే సభలో ఒక యువతి స్టేజీ పైకి వచ్చింది. మైకు తీసుకున్నది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ స్లోగన్లు ఇచ్చింది. పలుమార్లు ఆ యువతి పాకిస్తాన్ కు జిందాబాద్ కొట్టింది. దాంతో స్టేజి వెనుక భాగంలో ఉన్న ఒవైసీ తదితరులు పరుగున వచ్చి ఆ అమ్మాయి చేతిలో మైక్ లాక్కున్నారు. ఆ అమ్మాయి చివరకు హిందూస్థాన్ జిందాబాద్ అని ఒక్క సారి నినాదం చేసింది. తక్షణమే రంగంలో దిగిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఉప్పర్ పేట్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు.