కరోనా వైరస్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ రావు పిలుపునిచ్చారు. ఎవరూ బయటకు రాకుండా ఉంటే కరోనా మహమ్మారీ పారిపోతుందని ఆయన అన్నారు.
నేడు ఆయన ఆధ్వర్యంలో జవహర్ నగర్ లో పద్మశాలి సంఘం పేద కుటుంబాలకు, నారాయణగూడా లోని పద్మశాలి భవన్ లోని వాచమేన్ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు పగిడిమర్రి హరి, ఎలాగందుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.