39.2 C
Hyderabad
March 29, 2024 16: 20 PM
Slider ముఖ్యంశాలు

సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరికి అస్వస్థత

pasam yadagiri

సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి అస్వస్థతో ఆస్పత్రిలో చేరారు. మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమీర్‌పేటలోని ఇండో యూఎస్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా కుప్పకూలారు. వెంటనే ఆస్పత్రి వర్గాలు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని అస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇటీవలె ఆయనను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రవీంద్రభారతిని తెలంగాణ కళలను ప్రచారం చేసేవారికి కాకుండా ఆంధ్రావారికి ఇస్తున్నారని, తెలంగాణ వారికి అన్యాయం జరుగుతున్నదని వాదనకు దిగడంతో సైఫాబాద్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాతి పరిణామాలలో కేసీఆర్ జర్నలిస్టు యాదగిరిని పూర్తిగా దూరం పెట్టారు. యాదగిరి ఈనాడు, ఉదయం లాంటి పత్రికలలో ఉన్నత స్థాయిలలో పని చేశారు.

Related posts

దేశ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్ధి  యువజనులదే

Murali Krishna

అర్ద‌రాత్రిళ్లు..అక్క‌డ‌ ఖాకీలు చేస్తున్న ప‌ని అదీ….!

Satyam NEWS

వీళ్లు మామూలోళ్లు కాదు హైవే హంతకులు

Satyam NEWS

Leave a Comment