దేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్న పౌరసత్వ చట్టం, ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ లకు సంబంధించి ప్రజలే బిజెపి ఆర్ ఎస్ ఎస్ లకు తగిన సమాధానం చెబుతారని మజ్లీస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాడుతూనే ఉంటామని ఆయన అన్నారు.
ప్రజలు దేశ వ్యాప్తంగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. ఈ చట్టాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్ట్ లో కేసు వేశామని ఆయన అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎంత మంది మీద కేంద్ర ప్రభుత్వం తన ప్రతాపాన్ని చూపించినా, రాబోయే రోజుల్లో బిజెపి, ఆర్ఎస్ఎస్ లకు బలమైన సమాధానం దేశ ప్రజలు ఇస్తారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.