తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలని పిరమాల్ గ్రూప్ నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణలో తనకున్న 14 వందల మంది ఉద్యోగులకు అదనంగా మరో ప్రత్యక్ష 600 ఉద్యోగాలు కల్పించేందుకు ఈ పెట్టుబడితో అవకాశం కలుగుతుంది. ఈ మేరకు వచ్చే నెల తెలంగాణలో పిరమాల్ గ్రూప్ సీనియర్ ప్రతినిధి బృందం పర్యటిస్తుంది. దావోస్ లో మంత్రి కేటీఆర్ తో పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్ సమావేశం అయ్యారు.
మంత్రి కేటీఆర్ తో సమావేశం అనంతరం ఈ భారీ పెట్టుబడి పెట్టేందుకు గ్రూపు నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాలసీల నేపథ్యంలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్లను హైదరాబాద్ కి తరలించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని వారు తెలిపారు.