టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ నటి శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెడుతోందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. కొంతకాలం కిందట టాలీవుడ్ లో చోటుచేసుకున్న అవాంఛనీయ పరిణామాల నేపథ్యంలో శ్రీరెడ్డి చెన్నైకి మకాం మార్చింది.
ఇటీవల కొంతకాలంగా మళ్లీ తనదైన శైలిలో వ్యాఖ్యలు ప్రారంభించింది. తనను తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతుండడంతో భరించలేకపోయిన రాకేశ్ మాస్టర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.