పాపం అతను ఎంతో పేదవాడు. రోజు కూలి చేసుకుని బతికేవాడు. అయితే గ్రామంలో బహిరంగ మలమూత్ర విసర్జన చేసాడని అతనిపై భరించలేని జరిమానా విధించారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం విఠలపూర్ గ్రామములో జరిగిందీ ఘటన. ఆ గ్రామానికి చెందిన తలరి నర్సప్ప అనే వ్యక్తి బహిర్భూమికి వెళ్లడంతో పంచాయతీ కార్యదర్శి అతనికి 500 రూపాయల జరిమానా విధించారు.తాను చేసిన పని నేరమని అప్పటి వరకూ అతనికి తెలియదు. ఆతర్వాత జరిమానా చూసి తెలుసుకున్న ఆ వ్యక్తి గత్యంతరం లేక వేసిన జరిమానాను కట్టి రసీదు తీసుకున్నాడు.నిన్న మొన్నటి వరకు హరితహారంలో నాటిన మొక్కలను తిన్నందుకు మేకలకు, పశువులకు జరిమానాలు విధించిన అధికారులు ఇక ఇప్పుడు బహిర్భూమికి వెళ్లిన మనుషులకు జరిమానాలు మొదలు పెట్టారు.
previous post