క్రీస్తు మార్గం అందరికి అనుసరణీయమని నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అరవింద బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి, కొవ్వొత్తుల వెలుగులతో వైభవంగా వేడుకలను నిర్వహించారు.
పేద, బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి గా క్రీస్తు వెలుగొందారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సాధించాలన్న పట్టుదల ఉంటే చాలు ఆస్తులతో సంబంధం లేకుండా ఎంత గొప్ప స్థానాలకైన చేరుకోవచ్చని అన్నారు. యువత వారి నైపుణ్యాలను గుర్తించుకొని వాటికి సానపెట్టి ఉన్నతంగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వల్లెపు నాగేశ్వరరావు, మాజేటి వెంకటేష్, కొల్లి బ్రహ్మయ్య ,పులిమి రామిరెడ్డి, గొట్టిపాటి జనార్ధన్ బాబు ,సేసిల్ ,బంగారం తదితరులు పాల్గొన్నారు.