అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లాలో నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తాయి. ఏపీ అసెంబ్లీ లో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టినందుకు నిరసన తెలుపుతూ జాతీయ రహదారిపై మంట వేసి తమ నిరసన తెలిపారు. ఏపీ అసెంబ్లీ లో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.
ఈ బిల్లులో పరిపాలన రాజధానిగా విశాఖపట్నం శాసన రాజధానిగా అమరావతి రాజధాని కర్నూలు ఉండనుందని స్పష్టం చేశారు. ఇదివరకు సి ఆర్ డి ఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అధారిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇలా మూడు రాజధానులు తమకు సమ్మతం కాదని తూర్పుగోదావరి ప్రజలు తమ నిరసన తెలిపారు.