27.7 C
Hyderabad
April 24, 2024 08: 17 AM
Slider తెలంగాణ

పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం

1457943060-6067

పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తి స్థాయి పరికరాలతో రోగ నిర్థారణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగ నిర్ధారణ కేంద్రాల ఏర్పాటుపై శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఈటెల సమాధానం చెప్పారు. సుమారు 77 కోట్ల రూపాయలతో ఆల్ట్రాసౌండ్, ఎక్స్‌రే సహా పలు అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. పూర్తిస్థాయి రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు రోగాల నయం కోసం మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఈటెల తెలిపారు.

Related posts

విజయనగరానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స..!

Bhavani

పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి

Satyam NEWS

గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment