రామ్ గోపాల్ వర్మ మరో ‘ఆణిముత్యం’ సినీ ప్రేక్షకులపైకి వదలబోతున్నట్లు కనిపిస్తున్నది. తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన దిశ హత్యాచార ఘటన. రామ్ గోపాల్ వర్మ ఈ ఘటనపై సినిమా తీస్తానంటూ ప్రకటన చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు దోషుల్ని పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. దిశ రేప్, హత్య కేసులో ఒక దోషి చెన్నకేశవులు. అతని భార్యను రామ్ గోపాల్ వర్మ కలిశారు.
చెన్నకేశవుల్ని 16 ఏళ్లకే రేణుక పెళ్లి చేసుకుందని.. ఇప్పుడు 17 ఏళ్ల వయస్సులోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుందని ఆయన ట్వీట్ చేశారు. అతడు దిశతో పాటు… రేణుకను కూడా బాధితురాలిని చేశాడంటూ వర్మ తన ట్వీట్లో పేర్కొన్నారు..వాడు చేసిన వెధవ పనికి.. ఇప్పుడు భార్యతో పాటు… పుట్టబోయే బిడ్డకు కూడా భవిష్యత్తు లేకుండా పోయిందన్నారు. రేణుకను హీరోయిన్ గా చూపించి ఆమెను ఒక వీరనారిగా చూపిస్తాడేమో రామ్ గోపాల్ వర్మ చూడాలి.