40.2 C
Hyderabad
April 19, 2024 18: 27 PM
Slider తెలంగాణ

9 నెలల బాలికను రేప్ చేసినా ఉరిశిక్ష వేయరా?

revanth

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఏకరువు పెట్టిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి లోక్ సభలో మైక్ కట్ చేశారు. రేవంత్ రెడ్డి నేడు లోక్ సభలో మాట్లాడుతూ తల్లి ఒడిలో నుంచి తొమ్మిది నెలల పసిపాపను ఎత్తుకెళ్లి రేప్ చేసి, చంపిన హంతకుడికి ఉరిశిక్ష విధించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఆ దోషికి వెంటనే శిక్ష పడేలా సభ చర్యలు తీసుకోవాలి.

నిర్భయ ఘటన జరిగి, నిర్భయ చట్ట వచ్చి 7 ఏళ్లు జరిగినా దోషులకు ఉరిశిక్ష విధించడం లేదు అని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో హైదరాబాద్ గానీ, కోయంబత్తూరు గానీ, మరేదైనా ప్రదేశం గానీ.. 2016 నివేదిక ప్రకారం.. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌లో 4 వందలకుపైగా రేప్ కేసులు నమోదయ్యాయి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా.. స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం తెలిపారు.

నీ ప్రాంతం కాకుండా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. అయితే తాను ప్రసంగాన్ని ముగిస్తాను.. మరో అవకాశం ఇవ్వాలని కోరారు.. రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. మోదీ మన్ కీ బాత్‌లో చాలా విషయాలు అంటూ మొదలుపెట్టగానే మైక్ కట్ చేయడంతో గందరగళం నెలకొన్నది.

Related posts

ఒకరి ప్రాణం తీసిన లూడో గేమ్ గొడవ

Bhavani

ఘనంగా అల్వాల్ లయోలా అకాడమీ  టెక్నోవగాంజా 2023

Satyam NEWS

హైకోర్టు తీర్పుతో ఆనందోత్సాహాలలో ఉండవల్లి వాసులు

Satyam NEWS

Leave a Comment