కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారు పేట వద్ద 65నెం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టడంతో నాలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమం గా ఉంది. అతడిని నందిగామ ప్రభుత్వ హస్పిటల్ కు తరలించారు. మృతులు నందిగామ లోని విజయాటాకిస్ సెంటర్ కు చెందిన వారు గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
previous post