తిరుపతి లో రౌడీ షీటర్ బెల్టు మురళిని దారుణంగా హత్య చేశారు. లీలామహల్ సమీపంలోని ఎస్ కే పాస్ట్ వద్ద రోడ్డు పై అతికిరాతకంగా అతడిని నరికి చంపారు. మొత్తం 8 మంది కలిసి ఈ హత్య చేసినట్టు స్థానికుల చెబుతున్నారు. రౌడీ షీటర్ బెల్టు మురళి ఒక మర్డర్ కేసులో ప్రదాన నిందితుడు.
అంతే కాకుండా తిరుపతి పట్టణంలో అతడిపై పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఎవరో కక్షగట్టి అతడిని చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హంతకుల కోసం తిరుపతి పోలీసుల వేట కొనసాగిస్తున్నారు.