ఎవరైనా ఉన్నత స్థాయి ఆఫీసర్లు కింది స్థాయి సిబ్బంది తో పనిచేయిస్తారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్నారు కాబట్టి. అందుకు భిన్నమైన పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లా లో కనిపించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తను కూడా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమానంగా పారిశుద్ధ్య పనుల్లో సేవలందిస్తు కనిపించారు.
ఒక ఐఏఎస్ అధికారి చెత్తను ఎత్తుతూ గ్రామాల్లోని పలువురు ప్రజాప్రతినిధులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మొన్న నిజామాబాద్ కలెక్టర్ సైకిల్ పై వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీ చేస్తే నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ చెత్తను ఎత్తుతూ శ్రమైక జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.