28.2 C
Hyderabad
April 20, 2024 12: 34 PM
Slider నిజామాబాద్

బర్త్ డే స్పెషల్: కేసీఆర్ కోసం కాశీవిశ్వనాధుడికి పూజలు

kasinath puja

ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం పురస్కరించుకొని బిచ్కుంద మండల కేంద్రంలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఐటిఐ కళాశాలలో మొక్కలు నాటారు. మండలంలోని ఆయా గ్రామాల్లో సర్పంచులు, అధికారులు ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ పటేల్, జెడ్పిటిసి భారతీ రాజు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటరావు దేశాయ్, నాయకులు బొమ్మల లక్ష్మణ్, గణేష్, హాజీ లక్ష్మణ్, హనుమాన్లు, రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని పిఆర్టియు రాష్ట్ర, జిల్లా స్థాయి సభ్యుల ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ఉర్దూ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

ఇట్టి కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే పాల్గొని మొక్కలు నాటారు. ఏ ఒక్క మొక్క ఎండిపోకుండా సమ్ రక్షించాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు జిల్లా సభ్యులు సీమ శ్రీనివాస్, మండల అధ్యక్షులు ఇర్ షాద్, కార్యదర్శి చంద్రకాంత్, ఉపాధ్యాయులు వెయిద్ భూషణ్, ప్రధానోపాధ్యాయురాలు హలీం ఉన్నిసా, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

Related posts

విశాఖ తెలుగుదేశం నాయకుడి ఆస్తులు నేలమట్టం

Satyam NEWS

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి

Satyam NEWS

ఖాకీ ఛీటింగ్: అమ్మాయిని ట్రాప్ చేసిన పోలీసు అధికారి

Satyam NEWS

Leave a Comment