మహాశివరాత్రిని పురస్కరించుకొని నిర్మల్ బస్టాండ్ నుండి ఆయా శివ క్షేత్రములకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కే. ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడ దర్శనానికి వెళ్లే భక్తులు నిర్మల్ బస్టాండ్ లోని మంచిర్యాల బస్సులు వెళ్లే పాయింట్ దగ్గర ప్రత్యేక శిబిరం ఉంటుందని అక్కడ సమాచారం అందిస్తారని ఆయన తెలిపారు.
అక్కడే వేములవాడ వెళ్లే ప్రత్యేక బస్సులు ఉంటాయని, శివ భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఆయన పేర్కొన్నారు. నిర్మల్ నుండి వేములవాడకు టిక్కెట్టు ధర పెద్దలకు,230/-రూ.లు,పిల్లలకు 130/- ఉంటుందని అలాగే నిర్మల్ చుట్టూ ఉన్న శివక్షేత్రములయిన బూర్గుపల్లి కి 30/- పిల్లలకి 15/-రూ.లు, కదలి పాపహర క్షేత్రానికి 30/-రూ.లు, పిల్లలకు 15/-రూ.లు అలాగే కాల్వ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి మందిరానికి 20/- రూ.లు పిల్లలకు 10/-లు,
శ్రీరాంసాగర్ శివాలయానికి 20/-లు పిల్లలకు 10/-లు,నేరడిగొండ మండలం కుంటాల జలపాతానికి 30/-రూ.లు పిల్లలకు 15 రూ.లు ఉంటుందని భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ఆర్టీసీ కి సహకరించ వలసిందిగా ఆయన పేర్కొన్నారు.