లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు పౌష్టికాహారం అందాలనే లక్ష్యంతో శ్రీనివాస హేచరీస్ 5 లక్షల కోడి గుడ్లను ప్రభుత్వానికి అందచేసింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ ఆధ్వర్యంలో శ్రీనివాస హేచరీస్ ఎండి సురేష్ నాయుడు రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు ఆఫర్ లెటర్ ను అందచేశారు.
ఈ కోడి గుడ్ల విలువ 25 లక్షల రూపాయలు ఉంటుంది. బస్తీలలో పేదవారికి పౌష్టికాహారం అందాలనే సదుద్దేశ్యంతో ఈ వితరణ చేసినట్లు శ్రీనివాస హేచరీస్ ఎండి సురేష్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ ను, శ్రీనివాస హేచరీస్ ఎండి సురేష్ నాయుడు లను మంత్రి కేటీఆర్ అభినందించారు.