27.7 C
Hyderabad
April 25, 2024 10: 18 AM
Slider శ్రీకాకుళం

కైండ్ గెశ్చర్: విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ వితరణ

school children

శ్రీకాకుళం పట్టణంలోని ఎ న్టీ ఆర్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న 46 మంది విద్యార్థులకు పరీక్షకు అవసర వస్తువులను ఉచితంగా అందచేశారు. వారికి మంచి మార్కులు రావాలని ఆల్ ఇన్ వన్ మెటీరియల్  పుస్తకాలు, పెన్నులు, జామెట్రీ బాక్స్ లు, స్కేల్ తదితర అవసర వస్తువులను క్రాఫ్ట్ ఉపాధ్యాయుడు  చేబియ్యం శ్రీనివాసరావు అభ్యర్ధన మేరకు సంగాం అగ్రహారానికి చెందిన నౌడూరి శ్రీనివాసరావు, భాగవతుల కృష్ణ, నిష్ఠల శ్రీరామూర్తి, నిష్టల సాంబశివ సోమయాజులు ( బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు) ఇచ్చిన విరాళంతో అందచేశారు.

 మొత్తం రూ.15000 మెటీరియల్ విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా అందచేశారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థి నౌడూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాలకు ఇలాంటి మంచి కార్యక్రమము చేయడంలో భాగస్వామ్యులను చేసినందుకు క్రాప్ట్ ఉపాధ్యాయుడైన సిహెచ్. శ్రీనివాసరావు కు , పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దేవదత్తానందుకు ధన్యవాదాలు తెలిపారు.

విద్యార్ధులకు ఉపయుక్తమైన వస్తువులను, పుస్తకాలను దాతల సహాయముతో పాఠశాల కు అందచేయిస్తున్న క్రాప్ట్ ఉపాధ్యాయుడు చేబియ్యం శ్రీనివాసరావు ను ప్రధానోపాధ్యాయులు అభినందించారు. దాతలకు పాఠశాల సిబ్బంది తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమములో హరినాధం, ఆదిత్య, వ్యాయామ ఉపాధ్యాయుడు పురుషోత్తం, సీతారాం, ఆర్ట్ ఉపాధ్యాయిని శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

Related posts

సంక్రాంతికి ఊరికి వెళితే ముందస్తు సమాచారం ఇవ్వండి

Satyam NEWS

అంబేద్కర్ ఓపెన్ డిగ్రి నాగర్ కర్నూల్ కోఆర్డినేటర్ గా షేక్ ఖాజబి

Satyam NEWS

తెలంగాణ ఆఫ్ కోర్కమిటీ లో నల్లమోతు

Bhavani

Leave a Comment