31.2 C
Hyderabad
April 19, 2024 06: 35 AM
Slider సినిమా

కరోనాపై యుద్ధానికి మహేష్ బాబు కోటి విరాళం

mahesh babu

కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు తన వంతు సాయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మొత్తం అందిస్తున్నట్లు మహేష్ బాబు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో అందరం కలిసి కట్టుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

సమస్యపై పోరాడేందుకు ప్రతి ఒక్కరూ అవసరమైన సాయం చేయాలని మహేష్ బాబు పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా అమలు జరుగుతున్న లాక్ డౌన్ కు అందరూ మద్దతు పలకాలని మహేష్ బాబు కోరారు. లాక్ డౌన్ నిబంధనలను అందరూ పాటించాలని మానవత్వంతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ యుద్ధంలో మనం గెలవాలని ఆయన అన్నారు.

Related posts

వీరపల్లె లో భత్యాల చీరలు దుప్పట్లు పంపిణీ

Satyam NEWS

అధికారులకు ప్రాణ సంకటంగా మారిన ప్రభుత్వ తప్పిదాలు

Murali Krishna

జాతిపిత మహాత్మా గాంధీ జీవితంపై ఆన్ లైన్ క్విజ్

Satyam NEWS

Leave a Comment