తమిళనాడులో చికెన్ బిర్యానీ పేరుతో కాకి మాంసాన్నిభోజన ప్రియులకు అంటగడుతున్న వైనాన్ని అక్కడి పోలీసులు బయట పెట్టారు.తమిళనాడు రామేశ్వరంలో ఓ దేవాలయంలో భక్తులు వేసిన బియ్యం తిని కాకులు చనిపోతున్నాయి. కాకులు చనిపోవడాన్ని గుర్తించిన భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు దేవాలయం పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు.
ఆ సమయంలో ఆ దేవలయానికి వచ్చిన ఓ వ్యక్తి కాకులకు బియ్యం చల్లి, అవి స్పృహ కోల్పోయిన తరువాత వాటిని తీసుకెళ్లడాన్ని పోలీసులు గమనించారు. బియ్యం చల్లిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గుడి ఆవరణలో కాకులకు చల్లుతున్న బియాన్ని మత్తు మందు కలుపుతున్నామని, ఆ బియ్యం తిన్న కాకులు స్పృహకోల్పోతున్నాయని చెప్పాడు. మత్తులో ఉన్న కాకులను తీసుకెళ్లి వాటి మాంసంతో బిర్యానీ చేస్తున్నట్లు, పలు హోటళ్లలో నాన్ వెజ్ ఐటమ్స్ లో కలుపుతున్నట్లు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.