బాపట్ల యంపీ నందిగం సురేష్ పై దాడి హేయమైన చర్య అని డి.సి.యం.సి.చైర్మన్ దండు గోపి అన్నారు. కడప జిల్లా రాజంపేట వైసీపీ కార్యాలయం వద్ద బుధవారం మీడియా సమావేశం లో దండు గోపి మాట్లాడుతూ అమరావతి రైతుల ముసుగులో టీడీపీ రియలేస్టేట్ వ్యాపారులు ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.
దళితులంటే టీడీపీకి, చంద్రబాబు నాయుడు కు గిట్టదని, వైసీపీ హయంలోనే దళితులకు న్యాయం జరిగిందని ఆయన తెలిపారు. దళిత చైర్మన్ గా తాము దళిత ఎంపీ అయిన నందిగం సురేష్ పై దాడిని ఖండిస్తూన్నానని, ఈ దాడికి కారకులైన మహిళలతో సహా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.