ఉపాధి లేక స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో స్వర్ణకారుల ఆత్మహత్యలు,స్వర్ణకారులు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో సమస్యల శాశ్వత పరిష్కారం కోసం స్వర్ణకార సంఘం పెద్దలతో ఆయన నేడు భేటి అయ్యారు. స్వర్ణకారులను ఆర్థికంగా బలోపేతం చెయ్యడమే లక్ష్యంగా స్వర్ణకార కోపరేటివ్ సొసైటీ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం. స్వర్ణకార వృత్తిని కొనసాగించే విధంగా,ఆర్థిక సహాయం,లోన్స్ ఇప్పిస్తాం,ఇన్సూరెన్స్ కల్పిస్తాం. వైద్య సేవలు,పిల్లల చదువుకు ఆర్థిక సహాయం అందిస్తాం. స్వర్ణకారుల పై పెడుతున్న అక్రమ కేసులు ఎదుర్కోవడానికి న్యాయ సహాయం అందిస్తాం.పార్టీలకు అతీతంగా కోపరేటివ్ సొసైటీ పనిచేస్తుంది అని లోకేష్ ఈ సందర్భంగా చెప్పారు.