బిచ్కుంద మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి ట్రై సైకిళ్లు పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు భీంరావు బస్వంత్రావు పాటిల్ మాట్లాడుతూ ఎం పి ల్యాండ్స్ నిధుల ద్వారా 60లక్షలతో మూడు వందల మూడు చక్రాల బ్యాటరీతో నడిచే వాహనాలు కొనుగోలు చేశామన్నారు.
ఒక్క వాహనానికి పన్నెండు వేలు మిగతా వికలాంగ సంక్షేమ శాఖ నుండి నిధులు వినియోగం చేసి కొనుగోలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులతో పాటు ఎంపిపి అశోక్ పటేల్ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు సాయవ్వ సాయిరామ్, పార్టీ అధ్యక్షులు వెంకట్రావ్దేశాయి, మాజీ మార్కెట్ అధ్యక్షులు రాజు, వైస్ఎంపిపి రాజు పటేల్, జిల్లా వికలాంగుల సంక్షేమ అధికారిణి అనురాధ, ఐ సిడిఎస్ సిడిపిఓ వైష్ణవి, ఆయా మండలాల దివ్యాంగులు పాల్గొన్నారు.