టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ. 1 కోటి 10 లక్షలు విరాళంగా అందింది. హైదరాబాద్కు చెందిన ఎం.దేవేందర్ రాజు అనే భక్తుడు ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు. అదేవిధంగా, తిరుపతికి చెందిన సిపిఆర్ కన్స్ట్రక్షన్స్ తరఫున శ్రీ కెవి.చలపతిరెడ్డి రూ.10 లక్షలు విరాళం అందజేశారు. ఈ మేరకు ఇద్దరు భక్తులు విరాళాల డిడిలను తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
previous post