వేములవాడ మున్సిపల్ పరిధిలోని 5, 8, 9,10వ వార్డుల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ తో కలిసి జడ్పీటీసీ నాగం కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని గడపగడపకు ప్రచారం నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. గత ఆరు సంవత్సరాలుగా వేములవాడ పట్టణం వెనుకబాటుకు కారణమైన టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, మహిళలు, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు..