దీన్ దయాల్ నగర్ కు చెందిన యువతి హత్య కేసులో నిందితుడ్ని సుబేదారి పోలీసులు అరెస్టు చేసారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి. రవీందర్ వివరాలను వెల్లడిస్తూ నిందితుడు పులిపాయిగౌడ్ ఆలియాస్ సాయికుమార్, గ్రామము నెమలిగొండ్ల, ఘన్పూర్ మండలం, జనగాం జిల్లాకు చెందినవాడు. నిందితుడు హంటర్రోడ్లోని ఓ ప్రవైయిట్ కళాశాలలో డీగ్రీ చివరి సంవత్సరం చదువుచుండగా మృతురాలు మానస హంటర్రోడ్డులోని నీలమ జంక్షన్ వద్ద తండ్రితో కలిసి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తునే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుచున్నది.
ఈ క్రమములో నిందితుడు కాలేజీకి వచ్చిపోయే క్రమంలో గత ఆరు నెలల క్రితం మృతురాలు, నిందితుడుకి మధ్య పరిచయం కావడంతో నిందితుడు మృతురాలి మధ్య మాటలు కలవడంతో పాటు ఇరువురు సెల్ఫోన్ల్లో కొద్ది రోజులుగా ముచ్చ టించుకున్నారు. ఇలా కొద్ది రోజుల గడిచిన తరువాత నిన్నటి రోజున మృతురాలి పుట్టిన రోజు కావడంతో నిందితుడు మృతురాలిని తనను కలిసేందుకు రమ్మని నిందితుడు సాయిగౌడ్ సెల్ఫోన్ ద్వారా తెలపడంతో మృతురాలు తాను భద్రకాళి గుడికి వెళ్ళి వస్తానని తన తల్లికి చెప్పి మధ్యాహ్నం బయలు దేరి వెళ్ళింది.
నిందితుడి సూచన మేరకు ముందుగా కోర్టు జంక్షన్ వద్ద వేచిచూస్తుండగా నిందితుడు కాజీపేట వైపు రమ్మని తిరిగి మృతురాలికి ఫోన్ల్లో తెలపడంతో కాజీపేటకు వెళ్ళి అక్కడ వేచి చూస్తున్న సమయంలో నిందితుడు కారులో వచ్చి మృతురాలని కారులో ఎక్కించుకోని కారులో బయలుదేరి చిన్న పెండ్యాల రైల్వే ట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో కారును నిలిపి వేసి నిందితుడు మృతురాలైన మానసను బలవంతంగా అనుభవించి హత్య చేశాడు. మానస మరణించడంతో ఈ హత్యనేరం తనపై రాకుండా వుండేందుకు శవాన్ని తరలించేం దుకుగాగాను నిందితుడు తన మిత్రులకు సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న నిందితుడి మిత్రులు శ్రీకాంత్, శ్రీకాంత్లు ఇరువురు సంఘటన స్థలానికి చేరుకోని శవంగా పడివున్న మానస మృతదేహాన్ని చూసిన నిందితుడి మిత్రులు నిందితుడుకి సహయం చేసేందుకు అంగీకరించగపోగా, సంఘటన స్థలం నుండి తిరిగి వెళ్ళిపోయారు. దీనితో నిందితడు ఒంటరిగానే హత్యకు గురైన మానస మృతదేహాన్ని కారులో వేసుకోని చీకటి అయ్యే వరకు చిన్న పెండ్యాల, హుస్నాబాద్, ఎల్కతుర్తి , కేయూసి సెంటర్ మీదుగా అశోక టాకీస్ జంక్షన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద వున్న నిర్మాష్యు ప్రదేశంలో నిందితుడు కారును నిలిపివేశాడు.
మానస హత్యను సహజ మరణంగా చిత్రీక రించేందుకు నిందితుడు కాలేజీ సమీపంలోని బట్టల షాపులో పంజాబీ డ్రసు కోనుగోలు చేసిన నిందితుడు.
తిరిగి కారులో బయలుదేరి హంటర్ రోడ్లోని న్యూశాయంపేటలోని రైల్వేట్రాక్ వద్ద నిందితుడు రక్త సిక్తమైన మృతురాలి శరీరం నుండి బట్టలను తోలగించిన నిందితుడు కోనుగోలు చేసిన బట్టలను మానస మృత దేహానికి అలకరించాడు. తిరిగి కొత్త బట్టలను వేసిన మానస మృతదేహన్ని నిందితుడు హంటర్ రోడ్లోని విష్ణుప్రియ గార్డేన్స్ పరిసరాల ప్రాంతానికి కారులో చేరుకోని ఎవరు లేని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు.
అనంతరం నిందితుడు తన కారుతో తాను నివాసం వుంటున్న నెమిలిగోండ్ల గ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడు. హత్యకు గురైన మానస అన్నయ్య గాదం శ్రీనివాస్ ఇచ్చిన పిర్యాదుపై కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు దర్యాప్తు నిర్వహించి మానసను నిందితుడు సాయిగౌడ్ హత్య చేసినట్లుగా ప్రాధమిక సాక్ష్యాధారాలను సేకరించిన సుబేదారి పోలీసులు ఈ మద్యాహ్నం నెమిలిగొండ్లలో నివాసం వుంటున్న నిందితుడితో పాటు నిందితుడు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకోని ముద్దాయిని కోర్టులో హజర్చడం జరుగుతుందని. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
గంటల వ్యవధిలో నిందితుడుని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి నాగరాజు, హన్మకోండ, వరంగల్ ఎ.సి.పి జితేందర్ రెడ్డి, సారంగపాణి, సుబేదారి ఇన్స్స్పెక్టర్ ఆజయ్, టాస్క్ఫోర్స్ , ఘన్పూర్ ఇన్స్స్పెక్టర్లు నందిరాంనాయక్, రాజీరెడ్డి, సుబేదారి ఎస్.ఐలు మహేందర్, రవి కానిస్టేబుళ్ళు అనిల్, రాము, వెంకన్న, రమేష్, లింగమూర్తిలను పోలీస్ కమిషనర్ అభినందించారు.