రాజధాని రైతులకు వ్యతిరేకంగా వాదించటానికి 5 కోట్లు ఖర్చు పెట్టేవాడు రైతు పక్షపాతి ఎలా అవుతాడు? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేకిగా చరిత్రలో నిలిచి పోవడం ఖాయమని ఆయన అన్నారు. తన సీబీఐ కేసులు వాదించే లాయర్నే ఈ కేసులు వాదించేందుకు పెట్టుకోవటం వెనక క్విడ్ ప్రోకో ఏమైనా ఉందా? అని రామకృష్ణ ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చి 7 నెలల కాలంలో అమరావతి అభివృద్ధికి 5 కోట్లు వెచ్చించని ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వాదించే లాయర్ కు రు.5 కోట్ల ప్రజాధనం ఫీజు కింద చెల్లించటం దుర్మార్గమని రామకృష్ణ అన్నారు. తక్షణమే 5 కోట్లు లాయర్ ఫీజు కింద ఇచ్చే జీవన ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయవాది ముకుల్ రోహత్గి నైతిక విలువలు ఉంటే ఫీజు కింద తీసుకున్న ప్రజాధనాన్ని తిరిగి ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.