37.2 C
Hyderabad
March 29, 2024 18: 49 PM
Slider ఆంధ్రప్రదేశ్

క్విడ్ ప్రోకో: రైతుల కేసులపై రూ.5 కోట్లు ఖర్చు చేస్తారా?

cpi-ramakrishna

రాజధాని రైతులకు వ్యతిరేకంగా వాదించటానికి 5 కోట్లు ఖర్చు పెట్టేవాడు రైతు పక్షపాతి ఎలా అవుతాడు? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేకిగా చరిత్రలో నిలిచి పోవడం ఖాయమని ఆయన అన్నారు. తన సీబీఐ కేసులు వాదించే లాయర్నే ఈ కేసులు వాదించేందుకు పెట్టుకోవటం వెనక క్విడ్ ప్రోకో ఏమైనా ఉందా? అని రామకృష్ణ ప్రశ్నించారు.

అధికారంలోకి వచ్చి 7 నెలల కాలంలో అమరావతి అభివృద్ధికి 5 కోట్లు వెచ్చించని ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వాదించే లాయర్ కు రు.5 కోట్ల ప్రజాధనం ఫీజు కింద చెల్లించటం దుర్మార్గమని రామకృష్ణ అన్నారు. తక్షణమే 5 కోట్లు లాయర్ ఫీజు కింద ఇచ్చే జీవన ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయవాది ముకుల్ రోహత్గి నైతిక విలువలు ఉంటే ఫీజు కింద తీసుకున్న ప్రజాధనాన్ని తిరిగి ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Related posts

ఎస్సై పైకి కారు పోనిచ్చిన వారిపై కఠిన చర్యలు

Satyam NEWS

డబల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

కరోనా చికిత్సకు మందుల కొరత రానివ్వొద్దు

Satyam NEWS

Leave a Comment