బిచ్కుంద మండలంలోని గుండె కల్లూరు గ్రామంలో శనగ కొనుగోలు కేంద్రంను సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించిందని, ఎవ్వరూ బిచ్కుంద మార్కెట్ యార్డు శనగ పంటను తీసుకురావద్దన్నారు.
అందరు రైతులు ఒకేసారి గుమిగూడి రాకుండా ఒక్కొక్కరు వచ్చి తమ విత్తనాలను అమ్ముకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బయట రాకుండా ఉండాలని కరోనా మహా మారి బారి నుండి తమను తామే రక్షించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు సర్పంచ్ సంగీత, తహశీల్దార్ వెంకటరావు, వ్యవసాయాధికారి పోచయ్య, సొసైటీ సిఇఓ శ్రావణ్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్, ఎంపీటీసీ సాయిలు, మాజీ సర్పంచ్ సాయి గొండా నాయకులు యాదవరావు గంగాధర్ ఖతగమ మాజీ సర్పంచ్ హనుమాన్లు గ్రామ రైతులు పాల్గొన్నారు.