26.2 C
Hyderabad
February 13, 2025 21: 56 PM
Slider ప్రత్యేకం

పసుపు సీతాఫలం వచ్చేసిందండోయ్

ఏటేటీ పసుపు సీతాఫలమా… నువ్వు ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చావు తల్లీ…? నేనేమీ వచ్చేయలేదండి.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక సప్తగిరి నర్సరీ రైతు కుప్పాల దుర్గారావు గారు ఉన్నారు కదండీ ఆయన తీసుకొచ్చారండి. నేను ఉండేది థాయిలాండ్ దేశంలో. అక్కడి నుంచి ఈ దుర్గారావు గారు ఎన్నో కొత్తరకం మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ ఉత్పత్తి చేయడం మీకు తెలిసిందే కదండీ. ఓహో…ఆయన తీసుకొచ్చారా…! అయితే ఇక నీవు మా ఇంటి దానివే.

ఎందుకంటే నీవు జీవం పోసుకున్నది ఇక్కడే కదా మరి.అవునండి.. మూడేళ్ల క్రితం నా మొక్కను తీసుకొచ్చి ఇక్కడ నాటారు. ఇప్పటికి పెరిగి పెద్దయి పండు నయ్యాను. ఇక నా ప్రత్యేకతలు ఏంటంటారా చాలా ఉన్నాయండోయ్. ఒక్క పసుపు రంగ మాత్రమే కాదు సీతాఫలం జాతిలో నేనొక విచిత్రమైన రకాన్ని. నా లోపల గుజ్జు ఎంతో రుచికరంగా ఉంటుంది. అంతేకాదు చాలా గట్టిగాను ఉంటుంది చాకుతో కోసుకుని తినే విధంగా. పై తొక్క దలసరిగా ఉండటం వల్ల దాన్ని ఒలుసుకొని లోపల భాగాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని తినవచ్చు.

అబ్బో చాలా ప్రత్యేకతలు ఉన్నాయే అంతటితో అయిపోలేదండి. ఇక్కడ దొరికే సీతాఫలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే దిగుబడినిస్తుంది. కానీ నేను రెండుసార్లు దిగుబడి కి వస్తాను. మాకు కావాలంటే ఈ.మొక్కలు దొరుకుతాయా… దుర్గారావు గారి గురించి మీకు కొత్తగా చెప్పేదేముందండి. ఆయన తలుచుకుంటే ఎన్నో మొక్కలను ఉత్పత్తి చేస్తారు.థాయిలాండ్ నుంచి తీసుకొచ్చిన మొక్కను ఇక్కడ వాతావరణంకు అనుకూలంగా పెంచి పోషించారు. ఇప్పటికే ఆ మొక్క కాండాలకు అంట్లు కట్టి పది పదిహేను వరకు అమ్మకాలు సాగించారు.

వచ్చే సంక్రాంతి తర్వాత మరిన్ని అంట్లు కట్టడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఏంటండీ… ఆ మొక్క ధర ఎంతో అడగాలని ఉందా. మొదట్లో మూడు నాలుగు వందలుంటాయి.ఉత్పత్తి పెరిగేకొద్దీ నలభై ఏభై రూపాలకు కూడా లభిస్తాయి. అంటే రాబోయే రోజుల్లో పసుపు సీతాఫలం మా అందరికీ అందుబాటులోకి వస్తుందన్నమాట. నీకు మా కడియం ప్రాంతంలోనూ, మా దేశంలోనూ మంచి భవిష్యత్తు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ స్వాగతిస్తున్నాం.

Related posts

స్వచ్ఛ గ్రామాలలో పెద్దపల్లి జిల్లా ఆదర్శం

Satyam NEWS

బీసీ సర్పంచ్ ను అవమానించిన దేవరకద్ర ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ సత్కరించిన గంగపుత్ర సంఘం

Satyam NEWS

Leave a Comment