ఎట్టకేలకు కరోనా వైరస్ పీడిత చైనా నుంచి 112 మందికి విముక్తి కలిగించి భారత్ తీసుకువచ్చారు. వీరంతా వూహాన్ నగరంలో ఉండేవారు కాగా వీరిలో 76 మంది భారతీయులు కాగా 36 మంది వివిధ దేశాలకు చెందిన వారు. వీరిని భారత్ తీసుకువచ్చి వైద్యం చేయించి పంపుతారు.
సీ17 విమానంలో భారత్ నుంచి 15 టన్నుల బరువైన మాస్కులు, ఇతర వైద్య సామాగ్రిని చైనా తీసుకెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు చైనాలో చిక్కుకున్న వారిని తీసుకొచ్చారు. వీరిలో కర్నూలుకు చెందిన జ్యోతి, శ్రీకాకుళంకి చెందిన సాయి కూడా ఉన్నారని సమాచారం. వీరందర్నీ చావ్లాలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో 14 రోజులపాటు పర్యవేక్షణలో ఉంచనున్నారు.