కృష్ణ జిల్లాలోని నందివాడ మండలం తమిరిస గ్రామంలో ప్రభుత్వ వైన్ షాపుల్లో అడ్డగోలు దోపిడీ జరుగుతున్నది.
అక్కడి సిబ్బంది నకిలీ ఎమ్మార్పీ స్టిక్కర్లు అంటించి మోసాలకు పాల్పడుతున్నారు. 150 రూపాయల బాటిల్పై 190 రూపాయల నకిలీ స్టిక్కర్లు అంటించి మరీ దోపిడి చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై సేల్స్మెన్, సూపర్వైజర్లను ఎక్సైజ్ సీఐ నాగమణి విచారించారు. భారీ ఎత్తున స్కామ్ జరిగినట్లు ఎక్సయిజ్ అధికారులు గుర్తించారు.
కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.