తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి 10 మందిని అరెస్టు చేసినట్లు గుంటూరు అర్బన్ పోలీసులు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రికార్డు అయి ఉన్న సీసీ టీవి ఫుటేజిని అడిగామని వారు ఇంకా ఇవ్వలేదని, సీసీ ఫుటేజి ఇచ్చిన తర్వాత మిగిలిన వారిని గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి వివరాలు ఇవి:
1) పానుగంటి చైతన్య, S/o పుల్లారావు,30 yrs ,యాదవ బజార్, ఓల్డ్ గుంటూరు
2) పల్లపు మహేష్ బాబు,s/o రామ్మూర్తి ,37 yrs ,గుంటూరు
3) పేరూరి అజయ్ ,s/o వెంకటేశ్వర్లు ,22 yrs , ఆపోజిట్ జికెర్ పబ్లిక్ హై స్కూల్ ,పట్టాభిపురం ,గుంటూరు
4) శేషగిరి పవన్ కుమార్ S/o హరిబాబు ,40 yrs, తమ్మరంగా రెడ్డి నగర్ ,3 rd లైన్ ,ఓల్డ్ గుంటూరు
5) అడపాల గణపతి S/o వెంకటేశ్వర్లు ,38 yrs, సంజీవయ్య నగర్ ,గుంటూరు
6) షేక్ అబ్దుల్లా S/o సైదులు ,52 yrs,లెనిన్ నగర్ ,విజయవాడ
7) కోమటిపల్లి దుర్గారావు S/o కృష్ణయ్య ,38 yrs , Door no…49-2-17c, ఉమిళనగర్ ,గుండాల ,కృష్ణ హోటల్ రోడ్ ,విజయవాడ
8) జోగ రమణ S/o సత్యనారాయణ ,38 yrs, కృష్ణవేణి అపార్ట్మెంట్ ,కృష్ణలంక ,విజయవాడ
9) గోక దుర్గాప్రసాద్ S/o వెంకటరావు ,43yrs , సుందరయ్య నగర్ తాడేపల్లి
10) లంక అభి నాయుడు, S/o రామలింగం,38 yrs, 4 th లైన్ , బ్రహ్మానంద రెడ్డి నగర్, మొగలరాజపురం, విజయవాడ.
మిగతా వారిని పట్టుకోవడానికి 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పాల్గొన్న వారందరిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు.