భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఉచిత కరోనా వ్యాక్సినేషన్ 100 కోట్లు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఆదేశానుసారం రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు బండారు వెంకట్ రావు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో వ్యాక్సినేషన్ 100 కోట్లు ప్రజలకు అందించిన ఘనత మోడీకి దక్కుతుందని కొనియాడారు.
ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని మోడీ ఆకాంక్షించారనీ తెలిపారు. కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ముత్తినేని జగదీష్, మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ ఓబీసీ మోర్చా గీత సెల్ కన్వీనర్ తాళ్ల బాలకృష్ణ, రామంతపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు సంకూరి కుమారస్వామి, ఉలుగొండ నారాయణ దాస్, కాపర్తి మోహన కృష్ణ, ఓబీసీ మోర్చా డివిజన్ అధ్యక్షుడు వేముల తిరుపతయ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు తాళ మంగమ్మ, స్వర్ణ షిండే, ఎస్.కె అక్తర్, రామంతపూర్ డివిజన్ యువ మోర్చా అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి, రామంతపూర్ డివిజన్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పడిగం నాగేష్, చెన్నోజు హరీష్ ,నాగేష్ గుప్త, తమ్మలి రవి, జాట్టసాయి ధీరజ్, రామ్ బ్రహ్మం, గోపాల్ , రాసాల సురేష్ గౌడ్, పెరిక బద్రీనాథ్, కందగట్ల దయానంద్ రెడ్డి, పర్రి శ్రీనివాస్, శైలేందర్, నరసింహారావు, రాపోలు మహేందర్, లింగం, మసిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కరుణాకర్, అల్లాడి నిరంజన్ గౌడ్, కామేశం, పాల్గొన్నారు.